రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 01:53 PM

రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రెండింగ్ పై లోకాయుక్త విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల అర్బన్ డెవ్ లప్ మెంట్ అథారిటీ,అమరావతి మెట్రోపాలిటిన్ రీజినల్ డెవ్ లప్ మెంట్ అథారిటీకి ఆమోదం తెలిపింది. విశాఖలో సచివాలయం,హెచ్ వోడీ కార్యాలయాలు అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, భూములిచ్చిన రైతులకు 15 ఏళ్లు కౌలు, పరిహారం రూ. 2500 నుంచి 5000 వేలకు పెంచాలని నిర్ణయించింది కేబినెట్.





Untitled Document
Advertisements