యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త చిత్రం `ఫైటర్` షూటింగ్ నేడు ప్రారంభమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పూరి, ఛార్మిలతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో పాటు హిందీలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా హైప్ తీసుకు రావడానికి బాలీవుడ్ హీరోయిన్ని నటింప చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగా ముందు జాన్వీకపూర్ను నటింప చేయాలని అనుకున్నారు. కానీ.. జాన్వీకి డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండేను నటింప చేస్తున్నారు. అనన్యపాండే ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం `సాహో`లో చుంకీపాండే మెయిన్ విలన్గా నటించాడు.