అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా కోహ్లీ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈక్రమంలో ఎంఎస్ ధోనీని వెనక్కినెట్టి అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. అయితే అత్యంత తక్కువ ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. మరోవైపు ఇదే మ్యాచ్లో వన్డేలలో 5వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన కెప్టెన్గాను కోహ్లీ వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ రికార్డు కూడా ధోనీ పేరిటే ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో 89 పరుగులు చేసిన కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు దక్కించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 199 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 11,208 పరుగులు చేశాడు. దీంతో అగ్రస్థానంలో ఉన్న ధోనీని వెనక్కినెట్టి టాప్ ప్లేస్కు చేరుకున్నాడు. ధోనీ 330 ఇన్నింగ్స్ల్లో 11,207 పరుగులు చేయగా.. కోహ్లీ మాత్రం అతనికి కంటే 131 తక్కువ ఇన్నింగ్స్ల్లోనే ఇన్ని పరుగులు చేయడం విశేషం.
Virat Kohli, smashing record after record pic.twitter.com/jofIv1gNtr
mdash; ESPNcricinfo (@ESPNcricinfo) January 20, 2020
Just 82 innings for Virat Kohli to get to 5000 ODI runs as captain. That#39;s 45 innings faster than anyone else has managed! https://t.co/MZM4CfJQ8G #INDvAUS pic.twitter.com/wBuPXo2mUo
mdash; ESPNcricinfo (@ESPNcricinfo) January 19, 2020