హల్వా వేడుకతో కేంద్ర బడ్జెట్‌

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 04:02 PM

హల్వా వేడుకతో కేంద్ర బడ్జెట్‌

2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతులు ముద్రించే ముందు ఆర్థిక శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌‌లో సంప్రదాయంగా నిర్వహించే ‘హల్వా వేడుక’ ఇవాళ జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్ సహా ఇతర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్ధిక శాఖకు చెందిన పలువురు అధికారులు బయటి ప్రపంచానికి దూరం జరగబోతున్న దానికి సూచికగా ‘హల్వా వేడుక’ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఓ పెద్ద కడాయిలో హల్వా వండి అర్ధిక శాఖ సిబ్బంది అందరికీ వడ్డిస్తారు. హల్వా వేడుక పూర్తి కాగానే బడ్జెట్ ప్రతులు ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఇక అప్పటి నుంచి ఆర్ధిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు... బడ్జెట్ వ్యవహారాల్లో పాల్గొనే అధికారులందరికీ తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోతాయి. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.





Untitled Document
Advertisements