ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడన్గా ముంబై ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. యాపీ ఫిజ్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తారక్ దానికి సంబంధించిన ఓ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ తారక్ను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తనను ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఫోటోగ్రాఫర్ను దగ్గరికి పిలిచిన ఎన్టీఆర్.. `నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా?` అంటూ సరదాగా కామెంట్ చేశాడు. గతంలోనూ ఎన్టీఆర్ ముంబై వెళ్లి సమయంలో ఆ ఫోటోగ్రాఫర్ను చూశాడు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ సారి దగ్గరకు పిలిచి మరి విచారించాడు.
Look what #jrntr sir said to paparazzi guy @kamlesh_nand when he spotted @tarak9999 at Hyderabad airport #RRR #jrntrfans #Tollywood pic.twitter.com/Lof0ZIXV9A
mdash; ARTISTRYBUZZ (@ArtistryBuzz) January 19, 2020