అసెంబ్లీలో జగన్ కునుకు...ప్రతిపక్షాల సెటైర్లు....పిక్ వైరల్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 06:16 PM

అసెంబ్లీలో జగన్ కునుకు...ప్రతిపక్షాల సెటైర్లు....పిక్ వైరల్

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కనుకుతీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరి తర్వాత మాట్లాడుతుండగా సీఎం జగన్ కాసేపు తలవాల్చారు. ఓవైపు రాజధానులపై అసెంబ్లీలో కీలక చర్చ, బయట రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రం యావత్తూ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే రాజకీయాల్లో నాయకులు చేసే ప్రతి చర్యనూ ప్రత్యర్థులు ఓ కంట కనిపెట్టి ఉంటారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కునుకుపాటుపై ప్రత్యర్థులు సెటైర్ వేసేస్తున్నారు. అలాగే ఆ ఫొటోలు కూడా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. జగన్ కునుకుతీత ఫొటో మీడియాలో వచ్చిన వెంటనే మాజీ మంత్రి, టీడీపీ నాయకులు నారా లోకేశ్ స్పందించారు.



‘‘ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే.. మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే.. ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు ‘సేవ్ అమరావతి, నా రాజధాని అమరావతి, ఏపీ విత్ అమరావతి’ అని హ్యాష్ ట్యాగ్‌లు జోడించారు.



అలాగే సీఎం జగన్ కునుకుపాటుపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ప్రజాసమస్య వేదికనా? లేక శయన పాన్పు వేదికనా అంటూ ఓ జనసేన అభిమాని పోస్టు చేశారు. ‘‘రైతులకి నిద్ర లేకుండా చేసారుగా.. మీకు ఎక్కడున్నా ఇట్టే నిద్ర పట్టేస్తుంది జగన్ గారు’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు సీఎం జగన్‌పై ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు పోస్టులు చేస్తున్నారు.






Untitled Document
Advertisements