భారీగా వసూళ్లు రాబట్టిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు'

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 12:35 PM

భారీగా వసూళ్లు రాబట్టిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు'

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తోంది. జ‌న‌వ‌రి 11న సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం 10రోజుల్లో రూ.200కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. కాగా.. షేర్ క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే రూ.124.42 కోట్లు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌గా.. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టించారు. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.





Untitled Document
Advertisements