కీర్తి సురేష్ చేయాల్సిన పాత్ర ప్రియమణిని వెతుక్కుంటూ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా ‘మైదాన్’ అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. ఈమూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీఅయ్యింది. అయితే ఏం తేడా వచ్చిందో ఏమో..ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ అవకాశం ప్రియమణిని వరించిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే.. నిజమో కాదోననే డౌట్ ఉంది. దాన్ని కాస్తా ఇప్పుడు ప్రియమణి క్లీయర్ చేసింది. ‘నాకుమైదాన్ ఆఫర్ వచ్చిన విషయం నిజమే. జనవరి నుంచి షూటింగ్లో జాయినవుతాను’ అంటూ తేల్చేసింది. బోనీ కపూర్ స్వయంగా ప్రియమణిని సంప్రదించారట. స్టోరీ గురించి, ఆమె పాత్ర గురించి బ్రీఫ్గా చెప్పారట. కథ నచ్చడంతో వెంటనే ఓకే అందట. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ ఇది.‘బదాయీ హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. సయ్యద్గా అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఆయన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుందన్నమాట. మొత్తానికి భలే చాన్స్ కొట్టిందిలే.