న్యూజీలాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగిన పేసర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసే క్రమంలో ఇషాంత్ పట్టు తప్పి పడిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతణ్ని మ్యాచ్ లో కొనసాగించమని ఢిల్లీ టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది. న్యూజిలాండ్తో తొలి టెస్టు ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ కోలుకుంటాడా..? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి