అండర్-19 వన్డే ప్రపంచకప్‌...భారత్ దెబ్బకి41కే ఆలౌట్

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 05:10 PM

అండర్-19 వన్డే ప్రపంచకప్‌...భారత్ దెబ్బకి41కే ఆలౌట్

అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 90 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ అండర్-19 టీమ్.. మంగళవారం జపాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.జపాన్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ప్రియమ్ గార్గె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ జట్టు.. భారత్ బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. రవి (4/5), కార్తీక్ త్యాగి (3/10)తో పాటు అకాశ్ సింగ్ (2/11), విద్యాధర్ పటిల్ (1/8) చెలరేగిపోవడంతో.. జపాన్ జట్టు విలవిలలాడింది. ఎంతలా అంటే..? ఆ జట్టులో అందరూ సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమవగా.. ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు డకౌటయ్యారు. దీంతో.. 22.5 ఓవర్లలోనే జపాన్ టీమ్ 41 పరుగులకి ఆలౌటైపోయింది.42 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత ఓపెనర్లు కేవలం 4.5 ఓవర్లలోనే ఊదేశారు. యశస్వి జైశ్వాల్ (29 నాటౌట్: 18 బంతుల్లో 5x4, 1x6), కుమార్ కుసర్గా (13 నాటౌట్: 11 బంతుల్లో 2x4) ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌కి 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఇక టోర్నీలో తర్వాత మ్యాచ్‌ని న్యూజిలాండ్ జట్టుతో శుక్రవారం ఆడనుంది.





Untitled Document
Advertisements