కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం!!!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 07:01 PM

కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారం!!!

కన్నకొడుకు ముందే తల్లిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన
గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనంతరం ఆమె ప్రైవేట్ పార్ట్స్పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా పరిధిలో జరిగింది. దభోయ్ పట్టణానికి చెందిన 27 ఏళ్ల యువతికి పెళ్లై ఒక కొడుకు ఉన్నాడు. గత కొద్దికాలంగా ఆమె మాజీ ప్రియుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఒంటరిగా కలవాలని బెదిరిస్తున్నాడు. తనకు పెళ్లై కొడుకు కూడా ఉన్నాడని చెప్పిన యువతి.. అతనిని కలిసేందుకు నిరాకరించింది. దీంతో మాజీ ప్రియుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. బ్లాక్‌మెయిల్‌కు భయపడిపోయిన వివాహిత.. అతనిని కలిసేందుకు ఒప్పుకుంది. తన కొడుకు కూడా ఉంటే అతను ఏమీ చేయడని భావించి వెంట కుమారుడిని కూడా తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక సీన్ మారిపోయింది. ఉన్మాదిగా మారిన మాజీ ప్రియుడు కన్నకొడుకు ముందే తల్లిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా రేప్ చేశాడు. అనంతరం ఆమె భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. మహిళ ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. పొత్తికడుపులో పొడిచాడు. నిర్మానుష్య ప్రదేశం కావడంతో బాధితురాలు కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది. అత్యాచారానికి పాల్పడిన మాజీ ప్రియుడే బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రి వద్ద వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు భర్తకు ఫోన్ చేసి దారుణ ఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.













Untitled Document
Advertisements