సరిసృపాలను బ్యాంకాక్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు చెన్నై ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు. ఇంటలిజెన్స్ సమాచారంతో అలర్ట్ అయిన అధికారులు… బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్వేస్ విమాన ప్రయాణికులపై నిఘా వేశారు… దీంతో.. చెన్నైకి చెందిన సురేశ్ (35) అనుమానాస్పదంగా కనపడడంతో అతని బ్యాగ్ ను చెక్ చేశారు. బ్యాగ్ లోని చాక్లెట్ డబ్బాలలో… బందీగావున్న..ఎర్రని చేతులుగల చిన్న కోతులు, ఊసర వెల్లులు, ఉడుతలు, ఎలుకలను గుర్తించారు. ఇవి దక్షిణ, మద్య అమెరికా ప్రాంతాల్లో నివసించేవిగా అధికారులు తెలిపారు. పశు వైద్య అధికారులు వచ్చి పరీక్షించగా… నలుపు, ఎరుపు ఉడుతలు చనిపోయినట్టుగా చెప్పారు.