శాసనమండలి రద్దు చేస్తే అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగు దేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఫై స్పందిస్తూ ఘాటు విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ అన్నా, నీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యే లను ఇచ్చింది 28 మంది ఎమ్మెల్సీ లకు భయపడి పారిపోవడానికి కాదు, దమ్ముగా పోరాడతావని. ఇంత పిరికివాడివి అనుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు జగన్ నిర్ణయానికి మద్దతు తెలిపేట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారు, ఎమ్మెల్సీ ని రద్దు చేసినపుడు ఎక్కడికి వెళ్లారు మీరంతా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పీకర్ గా అపుడు వ్యవహరించిన యనమల రామకృష్ణుడు అసెంబ్లీ లో ఎన్టీఆర్ కి మైక్ ఇవ్వకుండా ఏడిపించిన మీరా మాట్లాడేది? అంటూ ఘాటు సెటైర్లు వేస్తున్నారు.