సమత అత్యాచారం కేసు తీర్పు వాయిదా

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 10:23 PM

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో ఇవాళ(సోమవారం) తీర్పు రావాల్సి ఉంది. అయితే అది వాయిదా పడింది. జడ్జీ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారని… దీంతో తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత హత్యాచారం జరిగింది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఆమెను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారం చేసి హత్య చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఇప్పటికే విచారణ పూర్తయింది.





Untitled Document
Advertisements