పవన్ - కీరవాణి కాంబినేషన్

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 10:02 AM

అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అఫిషియల్ గా చెప్పలేదు కాని ఈ సినిమాకు సంబందించిన వర్క్ ఓ పక్క జరుగుతుందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వచ్చే సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణిని సెలెక్ట్ చేశారట. సో ఇన్నాళ్లు రూమర్ గా ఉన్న వార్త కాస్త హాట్ న్యూస్ గా మారింది. క్రిష్ చెప్పిన కథ నచ్చిన పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో బయటకు వెళ్లడిస్తారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు క్రిష్.





Untitled Document
Advertisements