కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయ్యలేదని కారణంతో ఓ వ్యక్తిని చితకబాదారు టీఆర్ ఎస్ నేతలు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బర్రెకుంటకు చెందిన ఆరెపల్లి రాజేశ్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. దీంతో టీఆర్ఎస్ నేత ఆరెపల్లి కుమార్ తన అనుచరులతో వెళ్లి రాజేశ్ పై దాడి చేశారు. అయితే ఓటు వేయలేదనే కారణంతోనే దాడి చేశారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్ పరిస్థితి విషమంగా ఉంది.