సీబీఐకి వివేకా కేసు అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్

     Written by : smtv Desk | Tue, Jan 28, 2020, 11:53 AM

సీబీఐకి వివేకా కేసు అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేసి ట్విస్ట్ ఇచ్చారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో వైఎస్ జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ నాలుగోది కావడం గమనార్హం. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపింది. కేసు విచారణ తుది దశలో ఉందని వెల్లడించింది. ఈ నాలుగు పిటిషన్లపై నేను ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోం శాఖను సునీత చేర్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తోన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యకు టీడీపీ ప్రభుత్వమే కారణమని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆరోపించారు. బాబు సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయగా.. జగన్ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణలో ఆశించిన పురోగతి లేకపోవడం, హంతకులేవరో తేల్చకపోవడంతో.. సీబీఐతో విచారణ జరిపించాలని వివేకా సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 62 మంది సాక్షులను సిట్ విచారించినప్పటికీ, నేరస్థులు ఎవరనే దిశగా ఆధారాలు సేకరించలేకపోయింది.





Untitled Document
Advertisements