‘లవ్‌స్టోరీ’: సాయిపల్లవి ముద్దు పెట్టినందుకు ఏడ్చేసిన నాగచైతన్య

     Written by : smtv Desk | Fri, Feb 14, 2020, 02:48 PM

‘లవ్‌స్టోరీ’: సాయిపల్లవి ముద్దు పెట్టినందుకు ఏడ్చేసిన నాగచైతన్య

ఎమోషన్స్‌తో నిండిన అందమైన ప్రేమకథలను అల్లేస్తుంటారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలన్నీ ‘మంచి కాఫీ’లా ఉంటాయి. ‘ఫిదా’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు మరో లవ్‌స్టారీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ రోజు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా’ అనే ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలను క్యూట్‌గా చూపించారు. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు సాయి పల్లవి.. నాగచైతన్య బుగ్గపై ముద్దుపెట్టేస్తుంది. దాంతో నాగచైతన్యా షాకైపోయి ఏడ్చేస్తాడు. అప్పుడు సాయి పల్లవి... ‘ముద్దు పెడితే ఎవరైనా ఏడుస్తారా’ అని అడగం ఫన్నీగా ఉంది. చూడబోతే ఇది కూడా ఓ మంచి లవ్‌స్టోరీలా ఉండబోతోందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల నుంచి ఎన్ని రకాల లవ్‌స్టోరీలు వచ్చినా అవి ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. అదీకాకుండా ఇప్పటివరకు నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించింది లేదు. ఓ ఫ్రెష్ పెయిర్‌తో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ఈ పాట ప్రివ్యూ చూసి నాగచైతన్య భార్య సమంత తెగ సంతోషించేస్తున్నారు. పాటను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులకు వ్యాలెంటైన్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నారాయణ్ దాస్, నరంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సినిమాకు సంగీతం అందించారు. హరిచరణ్ ఈ పాటను పాడారు.






Untitled Document
Advertisements