IPL 2020: రెండు సొంతగడ్డలపై రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 05:07 PM

IPL 2020: రెండు సొంతగడ్డలపై రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లు

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓ రెండు మ్యాచ్‌ల్ని గౌహతి వేదికగా ఆడనున్నట్లు ప్రకటించింది. టోర్నీ నిబంధనల ప్రకారం.. లీగ్ దశలో ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందులో ఏడు మ్యాచ్‌ల్ని తమ సొంతగడ్డపై ఆడే వెసులబాటు ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే తమ సొంతగడ్డగా జైపూర్‌ని నిర్ణయించుకున్న రాజస్థాన్ రాయల్స్.. తాజాగా గౌహతిలోనూ ఓ రెండు మ్యాచ్‌లను ఆడబోతున్నట్లు వెల్లడించింది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్, 9న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ల్ని గౌహతిలోనే ఆడబోతున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ స్పష్టం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌లో వేదికలో మార్పు కూడా చోటు చేసుకోనుంది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకి ప్రారంభంకానున్నాయి. మిగిలిన ఐదు మ్యాచ్‌లూ జైపూర్‌ వేదికగానే రాజస్థాన్ ఆడనుంది. ఇప్పటి వరకూ గౌహతి వేదికగా ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా జరగలేదు. ఐపీఎల్ 2019 సీజన్‌‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా రాజస్థాన్ రాయల్స్ అర్హత సాధించలేకపోయింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 11 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ 2020 సీజన్‌తో పుంజుకోవాలని రాజస్థాన్ ఆశిస్తోంది.





Untitled Document
Advertisements