నష్టపోయిన స్టాక్ మార్కెట్...సెన్సెక్స్ 140 పాయింట్లు డౌన్

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 05:15 PM

నష్టపోయిన స్టాక్ మార్కెట్...సెన్సెక్స్ 140 పాయింట్లు డౌన్

దేశీ స్టాక్ మార్కెట్ నష్టాల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం కూడా నష్టపోయాయి. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. దీంతో గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఇన్వెస్టర్ల ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 39,746 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 11,633 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ నష్టపోవడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం. ఇకపోతే ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 50లో సన్ ఫార్మా, బ్రిటానియా, టైటన్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా దాదాపు 4 శాతం పరుగులు పెట్టింది. అదేసమయంలో విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు నష్టపోయాయి. విప్రో దాదాపు 4 శాతం పడిపోయింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. దాదాపు 6 పైసలు లాభంతో 71.60 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.12 శాతం క్షీణతతో 51.69 డాలర్లకు దిగొచ్చింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.20 శాతం తగ్గుదలతో 47.66 డాలర్లకు క్షీణించింది.





Untitled Document
Advertisements