చెల్లికి ఎన్నారై సంబంధం...బుట్టలోపడి మోసపోయిన అక్క!

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 05:35 PM

చెల్లికి ఎన్నారై సంబంధం...బుట్టలోపడి మోసపోయిన అక్క!

తన చెల్లెలిని విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించిందో అక్క. అందుకు తగ్గట్టుగా పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఇంతలో ఆమె చెల్లెలికి సోషల్ మీడియా ద్వారా అండ్రీవ్ కొహెన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను భారత సంతతికి చెందిన వ్యక్తినేనని.. బ్రిటన్‌లో స్థిరపడినట్లు చెప్పాడు. బ్రిటన్ పౌరసత్వం కూడా ఉందని చెప్పడంతో చెల్లెలు అతనిని అక్కకి పరిచయం చేసింది. క్రమంగా వారి మధ్య స్నేహం కుదిరింది. ఆండ్రీ తరచూ అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతుండేవాడు. వాట్సాప్ చాటింగ్ చేసుకునేవారు. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదరడంతో అక్క మనసులో ఉన్న మాట చెప్పేసింది. తన చెల్లెలిని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న విషయాన్ని ఆండ్రీతో షేర్ చేసుకుంది. వెంటనే అవతలి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చెల్లెలిని తానే పెళ్లి చేసుకుంటానని ఆండ్రీ చెప్పడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గతేడాది డిసెంబర్ 31న ఫోన్ చేసి న్యూ ఇయర్‌కి అక్కా చెల్లెళ్లకి బ్రిటన్ నుంచి బహుమతులు పంపిస్తున్నట్లు చెప్పాడు. అనంతరం జనవరిలో మొదటి వారంలో వారికి కస్టమ్స్ అధికారుల నుంచి వాట్సాప్ కాల్స్ వచ్చాయి. బ్రిటన్ నుంచి గిఫ్ట్స్ వచ్చాయని.. అందుకోసం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నమ్మేసిన అక్కా చెల్లెళ్లు వాళ్లు చెప్పినట్టుగా భారీగా డబ్బులు జమ చేశారు. సుమారు రూ.72 లక్షలు వారి ఖాతాలో జమచేశారు. ఆ తరువాత కస్టమ్స్ అధికారుల పేరుతో వచ్చిన ఫోన్ నంబర్లకు తిరిగి కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన అక్కాచెల్లెళ్లు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు వాట్సాప్ చాట్ చేసి ఆండ్రీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements