భారీగా పెరగనున్న డేటా చార్జీలు...1 జీబీ డేటా రూ.35?

     Written by : smtv Desk | Fri, Feb 28, 2020, 08:13 PM

భారీగా పెరగనున్న డేటా చార్జీలు...1 జీబీ డేటా రూ.35?

ప్రస్తుతం రూ.4-5 మధ్యనున్న 1 జీబీ మొబైల్ డేటా ధరను కనీసం రూ.35కు పెంచాలని వొడాఫోన్ ఐడియా టెలికమ్యూనికేషన్ శాఖను కోరింది. ఈ మేరకు వొడాఫోన్ ఆ శాఖకు లేఖ రాసింది. దీంతో పాటు కాల్స్ ధరను నిమిషానికి 6 పైసలుగా నిర్ణయించాలని, దీన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని కోరింది. అప్పుడు మాత్రమే తాను చెల్లించవలసిన బకాయిలను చెల్లించగలనని తెలిపింది. వొడాఫోన్ ఐడియా తనకు వస్తున్న భారీ నష్టాలను గత కొన్ని వారాలుగా మెల్లమెల్లగా ప్రకటిస్తుంది. దీనికితోడు మార్కెట్ షేర్ కూడా పడిపోతూ ఉంది. అలాగే ప్రభుత్వానికి భారీగా ఏజీఆర్ బకాయిలను పడి ఉంది. వొడాఫోన్ ప్రభుత్వానికి రూ.53 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. దీనికి గానూ తమకు 18 సంవత్సరాల సమయం కావాలని కోరింది. ఇందులో మూడేళ్ల పాటు వడ్డీ, జరిమానా నుంచి మినహాయింపును ఇవ్వాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 1 జీబీ డేటా ధర ప్రస్తుతం రూ.4-5 మధ్య ఉండగా, దాన్ని రూ.35కు పెంచాలని, నెలవారి కనిష్ట మొబైల్ కనెక్షన్ చార్జీని రూ.50 చేయాలని కోరింది. వీటిని 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు అవుట్ గోయింగ్ కాల్స్ చార్జీలను కూడా 6 పైసలుగా నిర్ణయించాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే వొడాఫోన్ ఐడియా టారిఫ్ లను 50 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు వొడాఫోన్ తో పాటే ఎయిర్ టెల్, జియో కూడా టారిఫ్ లను పెంచాయి. ఇప్పుడు మళ్లీ వొడాఫోన్ కాల్, ఇంటర్నెట్ చార్జీలను పెంచాలని కోరుతోంది.





Untitled Document
Advertisements