ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి కొత్త సంవత్సరంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల్లోనే 37 వేల కోట్ల సంపదను నష్టపోయారాయన. ఇందులోనూ ఎక్కువ భాగం లాస్ గడిచిన 15 రోజుల్లోనే జరిగింది. ఈ అపర కుబేరుడిని చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారీగా దెబ్బకొట్టిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మార్కెట్లు కుప్పకూలుతాయన్న భయంతోనే
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద 2020 న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి 4.12 లక్షల కోట్లుగా ఉండేది. కానీ, 2019 డిసెంబర్ చివరిలో చైనా వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ కొద్ది రోజులకే ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. సంక్రాంతి సమయానికి కొత్త వైరస్ పలు దేశాలకు పాకింది. గ్లోబల్గా ఎకానమీ స్లో డౌన్ నడస్తున్న ఇదే సమయంలో చైనాలో అన్ని పరిశ్రమలు ఒక్కసారిగా దాదాపుగా మూతపడిన పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్లలో వణుకు మొదలైంది. దీంతో ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు తమ స్టాక్ హాల్డింగ్స్ను గంపగుత్తగా అమ్మకానికి దిగారు. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్ల పతనం శుక్రవారం కూడా కనిపించింది. రూ.10 లక్షల కోట్ల సంపద ఒక్కరోజులోనే ఆవిరైపోయింది.
మార్కెట్ రిస్క్ భయంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపదను నష్టపోయారని బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ తెలిపింది. దీంతో గడిచిన రెండు నెలల్లో రిలయన్స్ ఏకంగా 11 శాతం సంపదను నష్టపోయిందని చెప్పింది. కరోనా ఎఫెక్ట్తో భారీగా దెబ్బపడిందని, రూ.37 వేల కోట్ల నష్టపోయి.. 3.48 లక్షల కోట్ల సంపద మిగిలింది. ఇక భారత ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ విప్రో సంస్థ ఈ రెండు నెలల్లో 6,303 కోట్లు నష్టపోయింది.
భారత్ పారిశ్రామిక వేత్తల నష్టాలివీ
కంపెనీ నష్టం (రూ. వేల కోట్లలో)
రిలయన్స్ ఇండస్ట్రీస్ 37
విప్రో 6.3
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ 3.4
ఆదిత్యా బిర్లా గ్రూప్ 6.4
అదానీ గ్రూప్ 3.6