కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణాంతకమైన కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించాలి. ఇంట్లో, బయట మాత్రమే కాకుండా ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు కూడా దీన్ని అనుసరించాలి. ఎస్బీఐ ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా దూరాన్ని పాటించాలని దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది.
ఎస్బీఐ ఏటీఏం లేదా మరే ఇతర ఏటీఎం నుంచి అయినా డబ్బులు విత్డ్రా చేసుకునేటప్పుడు పాటించాల్సిన కొన్ని టిప్స్ను ఎస్బీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన కస్టమర్లకు తెలియజేసింది. ట్వీట్ చేసింది. కేవలం ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనాసరే ఈ టిప్స్ను ఫాలో అవ్వొచ్చు. వైరస్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. స్టేట్ బ్యాంక టిప్స్ ప్రకారం.. ఏటీఎంలో రూమ్లో ఎవరైనా ఉంటే లోపలికి వెళ్లొద్దు.
ఏటీఎం రూమ్లోని వస్తువులను, ప్రదేశాలను తాకవద్దు. మీరు దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతూ ఉంటే ఏటీఎంను ఉపయోగించడం మానేయండి. వెళ్లొద్దు. మీకు దగ్గు వస్తుంటూ కర్చిప్తో లేదా చేతితో అడ్డం పెట్టుకోండి. ఏటీఎం లోపల టిష్యూ పేపర్లు, మాస్క్లను పడేయవద్దు. ఇకపోతే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లకు యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, భీమ్ ఎస్బీఐ వంటి ఛానల్స్ను ఉపయోగించాలని స్టే్ట్ బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది.
అత్యవసరం అయితేనే బ్యాంకుకు కూడా రావాల్సిందని కోరింది. ఇంకా కరెన్సీ నోట్ల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇకపోతే స్టేట్ బ్యాంక్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వార్షిక బ్యాంక్ వార్షిక లాభంలో 0.25 శాతాన్ని కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ఖర్చు చేస్తామని బ్యాంక్ ప్రకటించింది. సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ నిధులను వినియోగిస్తామని బ్యాంక్ పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీఎస్ఆర్ ఫండ్స్ను కరోనా కోసం వినియోగించాలని కార్పొరేట్ వ్యవహరాల శాఖ పేర్కొంది.
Keep your transactions safe and yourself safer. Practice these safety tips and stop Coronavirus from spreading.#StateBankOfIndia #SBI #Coronavirus #COVID19 #ATMTips pic.twitter.com/wIIQyqOFln
mdash; State Bank of India (@TheOfficialSBI) March 23, 2020