మోదీ సర్కార్ శుభవార్త: ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై నో చార్జీలు..!

     Written by : smtv Desk | Tue, Mar 24, 2020, 03:43 PM

మోదీ సర్కార్ శుభవార్త: ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై నో చార్జీలు..!

మోదీ సర్కార్ తాజాగా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త అందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపికబురు తీసుకువచ్చారు. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలా రంగాలపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశం మాంద్యంలోకి జారుకునే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కరోనా బారి నుంచి రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇందులో బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలిగించే చర్చలు కూడా ఉన్నాయి. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా చార్జీలను తొలగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడు నెలలపాటు అంటే జూన్ 30 వరకు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి చార్జీలు పడవు. ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులు తీసుకోవచ్చు. చార్జీలు ఉండవు. అలాగే నిర్మలా సీతారామన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు దీని గుడువును పొడిగిస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా మరోసారి డెడ్‌లైన్‌ను పొడిగించారు. సాధారణంగా పాన్ ఆధార్ లింక్ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ గుడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఈ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 500కు దగ్గరిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే 16 వేల మందికి పైగా మరణించారు.





Untitled Document
Advertisements