బీఎస్6 మహీంద్రా బోలేరో లాంచ్...ధరెంతంటే?!

     Written by : smtv Desk | Tue, Mar 24, 2020, 06:58 PM

బీఎస్6 మహీంద్రా బోలేరో లాంచ్...ధరెంతంటే?!

మహీంద్రా వాహనాల్లో అత్యంత విజయవంతమైన కారు మహీంద్రా బోలేరో. తాజాగా ఈ కారును బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిందీ కంపెనీ. తాజాగా ఈ కారును లాంచ్ చేసిందీ సంస్థ. ఇప్పటికే ఈ 2020 మహీంద్రా బొలేరో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్దకు చేరుకుంది. దిల్లీ ఎక్స్ షోరూంలో బీఎస్6 మహీంద్రా బొలేరో ప్రారంభ ధర రూ.7.98 లక్షలు ఉండనున్నట్లు అంచనా. అయితే బీఎస్ 4 మోడల్ కూడా ఇంతే ధర ఉండటం గమనార్హం. అయితే బీఎస్6 మోడల్ ధర మాత్రం రూ.70,000 వరకు పెరిగినట్లు సమాచారం. ఎల్ఎక్స్, ఎస్ఎల్ఈ, ఎస్ఎల్ఎక్స్, జెడ్ఎల్ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో ఈ వాహనం లభ్యంకానుంది. వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముండనుంది. టాప్ వేరియంట్ మాత్రం రూ.9 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశముంది. ఈ సరికొత్త 2020 మహీంద్రా బొలేరో కారు.. ఎక్స్ టీరియర్, ఇంటీరియర్లో ఎన్నో అప్ డేట్లు ఉన్నాయి. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్ క్లస్టర్, బంపర్లు లాంటి అప్ డేట్లను పొందుపరిచింది. ఈ ఎస్ యూవీ క్రాష్ టెస్ట్, పాదచారుల భద్రతకు అనుగుణంగా నిబంధనలు మార్పులు చేశారు. కారు అంతర్భాగాన్ని గమనిస్తే అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతను పొందుపరిచారు. బీఎస్6 మహీంద్రా బొలేరో పవర్ ప్లస్ 1.5 లీటర్ మూడు సిలీండర్ల డీ75 డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 75 బ్రేక్ హార్స్ పవర్, 195 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. గతేడాది సెప్టెంబరులోనే మహీంద్రా బొలేరో 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను నిలిపివేసింది సంస్థ. ఈ వాహనం కేవలం బీఎస్4 నుంచి బీఎస్6 అప్ డేట్ మత్రమే కాదు. ఇందులో కొన్ని కాస్మటిక్ మార్పులు చేసింది. బీఎస్4 మోడల్లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులోనూ ఉండనున్నాయి. టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి అధునాతన సౌకర్యం కూడా ఈ కారులో ఉంది. భద్రతా పరమైన ప్రత్యేకతలకొస్తే.. ఇందులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, స్పీడ్ అలెర్ట్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండెర్, కారులోపల నుంచి డోర్ ఓపెన్ చేసేందుకు ఉన్న సెంట్రల్ లాకింగ్ సిస్టం కోసం మ్యానవల్ ఓవర్ రైడ్ ఆప్షన్ ఇందులో ఉంది. అంతేకాకుండా రివర్స్ లో పార్కింగ్ చేసేందుకు రేర్ పార్కింగ్ సెన్సార్లు కూడా మహీంద్రా బొలేరో పవర్ ప్లస్ వాహనం సొంతం. మహీంద్రా సంస్థ తన బొలేరో వాహనాన్ని తొలిసారి 2000 సంవత్సరంలో భారత మార్కెట్లో పరిచయం చేసింది. అప్పటి నుంచి అత్యధిక విక్రయాలు విక్రయాలు అందుకున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఏప్రిల్ 2019 నుంచి జనవరి 2020 మధ్య కాలంలో దాదాపు 52,828 యూనిట్లను విక్రయించింది. అంటే సగటున నెలకు 5,289 యూనిట్ల చొప్పున అమ్మింది. మహీంద్రా కార్లలో పాపులరైన స్కార్పియో సంస్థ వచ్చే ఏడాది బీఎస్6 ఫార్మాట్లో విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లను షట్ డౌన్ చేసింది మహీంద్రా సంస్థ. అంతేకాకుండా హాస్పిటల్ గ్రేడ్ వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ కోసం తాము పరిశోధించినట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా అని తెలిపారు. ఈ కంపెనీ కాకుండా ఇతర ఆటో సంస్థలు కూడా తమ కార్యకలపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.





Untitled Document
Advertisements