బ్యాంకుల నుంచి డోర్‌స్టెప్ సర్వీసులు...ఇంటికే డబ్బులు!

     Written by : smtv Desk | Wed, Mar 25, 2020, 12:26 PM

బ్యాంకుల నుంచి డోర్‌స్టెప్ సర్వీసులు...ఇంటికే డబ్బులు!

కరోనా వైరస్ దెబ్బకి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవడం కూడా కష్టంగానే ఉండొచ్చు. టైమ్ బాగోలేకపోతే కోవిడ్ 19 బారినపడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ కస్టమర్లకు ఇంటి వద్ద నుంచే పలు బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. వీటిల్లో ఏటీఎం సేవలు కూడా భాగమే. మీరు ఏటీఎంకు వెళ్లలేకపోతే ఇంట్లో కూర్చొనే డబ్బులు పొందొచ్చు. బ్యాంకులు కస్టమర్లకు డోర్‌స్టెప్ సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుల భాగంగా మీరు ఏటీఎంకు వెళ్లకుండానే ఇంటికి డబ్బులు రప్పించుకోవచ్చు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి తన కస్టమర్లకు డోర్‌స్టెప్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. మీరు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్‌ కలిగి ఉంటే.. మీరు ఇంటి వద్దకే డబ్బులు పొందొచ్చు. ప్రస్తుతం ఈ సర్వీసులు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఇతర కస్టమర్లు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం రూ.100 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ అయినా కూడా ఈ డోర్‌స్టెప్ సర్వీసులు పొందొచ్చు. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు డబ్బులు ఇంటి వద్దనే తీసుకోవచ్చు. క్యాష్ డెలివరీ కోసం ఈ బ్యాంక్ రూ.100 నుంచి రూ.200 వరకు చార్జ్ చేస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ బ్యాంక్ కస్టమర్లు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో క్యాష్ డెలివరీ ోసం అర్డర్ ఇవ్వొచ్చు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇంటికి డబ్బులు వస్తాయి. రూ.2,000 నుంచి ఏకంగా రూ.2 లక్షల వరకు హోమ్ డెలివరీ పొందొచ్చు. దీని కోసం బ్యాంక్ రూ.50 లేదా డెలివరీ అమౌంట్‌లో 18 శాతం వరకు చార్జీని వసూలు చేస్తోంది.





Untitled Document
Advertisements