ఒక్క రోజులోనే కొండెక్కిన బంగారం ధర...వెండిదీ ఇదే దారి!

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 11:43 AM

ఒక్క రోజులోనే కొండెక్కిన బంగారం ధర...వెండిదీ ఇదే దారి!

బంగారం ధర పరుగు ఆగడం లేదు. పసిడి ర్యాలీ చేస్తూనే వస్తోంది. ఈ రోజు కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ర్యాలీ చేయడంతో మన దేశంలో కూడా బంగారం ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1010 పెరుగుదలతో రూ.44,630కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1010 పెరుగుదలతో రూ.41,080కు ఎగసింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.790 ర్యాలీ చేసింది. దీంతో వెండి ధర రూ.41,810కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 1640 డాలర్ల సమీపంలోకి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పెరుగుదలతో 1643.60 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 1.03 శాతం తగ్గుదలతో 14.72 డాలర్లకు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర రూ.1010 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1010 పెరుగుదలతో రూ.41,870కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1010 పెరుగుదలతో రూ.43,070కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.790 పెరుగుదలతో రూ.41,810కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements