స్టేట్ బ్యాంక్ టైమింగ్స్‌లో మార్పు...పని వేళలు తగ్గింపు!!

     Written by : smtv Desk | Thu, Mar 26, 2020, 12:33 PM

స్టేట్ బ్యాంక్ టైమింగ్స్‌లో మార్పు...పని వేళలు తగ్గింపు!!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీకు ముఖ్యమైన గమనిక. స్టేట్ బ్యాంక్ తన వర్కింగ్ అవర్స్‌ను మార్చేసింది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచులు రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే పనిచేస్తాయి. అంటే బ్యాంక్‌ను 3 గంటలే తెరుస్తారు. స్టేట్ బ్యాంక్ పని వేళలు మార్పుకు ముఖ్య కారణం కరోనా వైరస్. కోవిడ్ 19 శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి ఉద్యోగులను రక్షించుకునేందుకు ఎస్‌బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందుకే బ్యాంక్ పని గంటలను తగ్గించేసింది. మీకు స్టేట్ బ్యాంక్‌లో ఏమైనా పని ఉంటే కొత్త టైమింగ్స్‌కు అనుగుణంగా బ్యాంక్‌కు వెళ్లండి. స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో దేశవ్యాప్తంగా బ్యాంక్ పని గంటల్లో మార్పులు చేశామని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బ్యాంకులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకే పనిచేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తెరుస్తున్నారు. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపెన్ చేస్తున్నారు. ఇకపోతే ఎస్‌బీఐ విధులకు హాజరయ్యే సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లను అందిస్తోంది. బ్యాంకుల్లో క్యూ లైన్‌లో వ్యక్తుల మధ్య 1 మీటర్ దూరాన్ని పాటిస్తున్నారు. ఇకపోతే బ్యాంక్ మొబైల్ ఏటీఎం సర్వీసులను కూడా అందిస్తోంది. దీంతో కస్టమర్లు సులభంగానే ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బులు తీసుకునే ముందు కొన్ని టిప్స్ పాటించాలని కస్టమర్లను కోరుతోంది. ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో ట్వీట్ చేసింది. కాగా ఎస్‌బీఐ మాత్రమే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి కూడా బ్యాంక్ టైమింగ్స్‌ను మార్చేశాయి. ఇవి కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. కాగా బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు కేవలం బ్యాంక్ బ్రాంచుల్లో ఎసెన్సియల్ సర్వీసులు మాత్రమే పొందగలరు. అవసరమైతేనే బ్యాంకులకు రావాలని కస్టమర్లను కోరుతున్నాయి.





Untitled Document
Advertisements