కరోనాపై పోరాటం...భారత్‌కు అమెరికా 2.9 మిలియన డాలర్ల సాయం

     Written by : smtv Desk | Sat, Mar 28, 2020, 08:10 PM

కరోనాపై పోరాటం...భారత్‌కు అమెరికా 2.9 మిలియన డాలర్ల సాయం

⍟ కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం. అలాగే, వెంటిలేటర్ల అవసరమైన దేశాలకు వాటిని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.





Untitled Document
Advertisements