టెస్టుల్లోకి రాహుల్ రీఎంట్రీ..!

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 02:59 PM

టెస్టుల్లోకి రాహుల్ రీఎంట్రీ..!

ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్ కె.ఎల్.రాహుల్ త్వరలోనే టెస్టు జ‌ట్టులోకి పునరాగమనం చేస్తాడని మాజీ క్రికెటర్ వ‌సీం జాఫర్ పేర్కొన్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక అభిమాని టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇస్తాడా అని ప్రశ్నించాడు. రాహుల్ తిరిగి ఖచ్చితంగా టెస్టుల్లోకి రీఎంట్రీ ఇస్తాడని జాఫర్ నమ్మకంగా చెప్పాడు. ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా జాఫ‌ర్ వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టుకు రాహుల్ కెప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే క‌రోనా వైరస్ కారణంగా ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. భార‌త వైట్ బాల్ క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మ‌న్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కె.ఎల్.రాహుల్ టెస్టుల్లోనూ రీఎంట్రీ ఇవ్వాల‌ని గత కొంత‌కాలంగా చూస్తున్నాడు. నిజానికి రాహుల్‌పై టీమిండియా మేనేజ్మెంట్ న‌మ్మక‌ముంచి, ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ల‌పై విఫ‌ల‌మైనా.. ఆస్ట్రేలియాపై అతనికి అవకాశం దక్కింది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన లో రాహుల్ విఫలమవడంతో టెస్ట్ జట్టులో తన స్థానం కోల్పోయాడు. రాహుల్ స్థానంలో యువ క్రికెటర్ శుబ్‌మాన్ గిల్‌ ఎంపిక చేశాడు. మ‌రోవైపు గత జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మ‌న్‌గా రాహుల్ అవకాశం పొందాడు. అప్పటి నుంచి వైట్‌బాల్‌ క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే తన ఫామ్‌ను బట్టి, ఇటీవల న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో రాహుల్‌ల‌కు అవకాశం వస్తుందని అంతా భావించారు. ఇక‌, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన, రాహుల్‌ను ఎంపిక చేయ‌లేదు. అయినప్పటికీ త్వ‌ర‌లోనే త‌ను టెస్టుల్లోకి ఎంపిక‌వుతాడ‌ని రాహుల్ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.





Untitled Document
Advertisements