మార్కెట్‌లోకి కరోనా పాలసీ...రూ.499 కడితే రూ.లక్ష

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 03:01 PM

మార్కెట్‌లోకి కరోనా పాలసీ...రూ.499 కడితే రూ.లక్ష

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిరగకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. ఇంకా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కూడా ఉత్తమమే. ఇప్పుడు మార్కెట్‌లో కరోనా వైరస్ కోసం తక్కువ ప్రీమియంతో పలు పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

క్లినిక్ హెల్త్‌కేర్ అనే సంస్థ కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాధికి సమగ్రమైన ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ సోకిన వారికి ఈ పాలసీ వర్తిస్తుంది. కరోనా పాలసీ కోసం ఏడాదికి రూ.499 చెల్లిస్తే సరిపోతుంది. తక్కువ ప్రీమియం ఈ పాలసీ అందుబాటులో ఉదని చెప్పుకోవచ్చు.


క్లినిక్ హెల్త్‌కేర్ కోఫౌండర్ సూరజ్ బలిగ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉందన్నారు. కొత్తగా లాంచ్ చేసిన పాలసీ వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుతుందని తెలిపారు. కరోనా సోకిన వారికి పూర్తిగా అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఈ ప్లాన్ రూపొందించామని పేర్కొన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా ప్రజలు కరోనా వైరస్ సందేహాలు తీర్చుకోవచ్చని పేర్కొన్నారు.


పాలసీ ఫీచర్ల విషయానికి వస్తే.. కరోనా వైరస్ సపోర్ట్ ప్లాన్ వల్ల ప్రైమరీ కేర్, ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ అనే రెండు లాభాలు పొందొచ్చు. కన్సల్టేషన్, 24 గంటలూ డాక్టర్ అసిస్టెంట్, రూ.లక్ష ఇన్సూరెన్స్ కవర్ వంటి పలు సర్వీసులు పొందొచ్చు. https://app.clinikk.com/ సైట్ ద్వారా మీరు పాలసీ కొనుగోలు చేయొచ్చు.





Untitled Document
Advertisements