SBI బాటలో మరో ప్రభుత్వ బ్యాంక్...రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం!

     Written by : smtv Desk | Mon, Mar 30, 2020, 04:39 PM

SBI బాటలో మరో ప్రభుత్వ బ్యాంక్...రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం!

దేశీ దిగ్గజ రంగ బ్యాంక్ స్టేట్ బ్యా్ంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవలనే రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీని దారిలోనే మరో బ్యాంక్ నడుస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా తాజాగా రుణ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటు (MCLR)ను 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల మధ్యలో తగ్గించేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలనే కీలక రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే రివర్స్ రెపో రేటులో కూడా 90 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్‌ను తగ్గించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటులో 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో ఈ రేటు 7.25 శాతానికి దిగొచ్చింది. అంతేకాకుండా బ్యాంక్ ఆప్ ఇండియా ఎంసీఎల్ఆర్ రేటును కూడా తగ్గించింది. 0.25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 8.2 శాతం నుంచి 7.95 శాతానికి దిగొచ్చింది. కస్టమర్లకు ఇది ప్రయోజనం కలిగించే నిర్ణయమని చెప్పుకోవచ్చు. బీఓఐ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించడంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయి. హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గొచ్చు. అలాగే ఇప్పటికే హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారికి ఈఎంఐ భారం దిగిరానుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రుణ రేట్లను తగ్గించింది. Bank of Baroda రెపో లింక్డ్ లెండింగ్ రేట్లలో 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో ఈ రేటు 7.25 శాతానికి దిగొచ్చింది. ఇక ఎస్‌బీఐ కూడా ఇటీవలనే రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్), ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటుతో (ఈబీఆర్) అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేట్ల గణనీయంగా దిగిరానున్నాయి.





Untitled Document
Advertisements