కరోనా కట్టడి కోసం...భారతి ఎంటర్ ప్రైజస్ రూ. 100 కోట్ల విరాళం

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:13 PM

కరోనా కట్టడి కోసం...భారతి ఎంటర్ ప్రైజస్ రూ. 100 కోట్ల విరాళం

భారత్‌ ప్రస్తుతం విప్కతర పరిస్థితులు ఎదర్కొంటుంది. దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం మవుతుంది. ప్రస్తుతం ఇండియా కోవిడ్-19పై పోరాడుతుంది. అయితే ఈ పోరాటానికి పెద్ద ఎత్తున సాయం అందుతోంది. సామాన్యుడి నుంచి ధనవంతుడు వరకు అంతా తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రస్తుతం మన జాతికి చేసే చిన్న సాయం కూడా ఎంతో మేలు చేస్తోంది. అందుకే అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం ముందుకొచ్చి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా భారతి ఎంటర్ ప్రైజస్ సంస్థ.. భారతి ఎయిరర్ టెల్, భారతి ఇన్ ఫ్రాటెల్ కోవిడ్ కోసం రూ. 100 కోట్ల విరాళాన్ని ప్రకటించాయి. ఇందులో కొంత మొత్తాన్ని వెటనే పీఎం కేర్స్ ఫండ్‌కు అందిస్తాయంది. మిగిలిన మొత్తంతో కరోనా కోసం పోరాడుతున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి అవసరమైన మెడికల్ కిట్‌ను అందిస్తామని తెలిపాయి. మాస్కులు, పీపీఈ, పది లక్షలు N-95 మాస్కుల్ని అందివ్వనున్నాయి. వంద కోట్లతో పాటు... అదనంగా భారతి ఎంటర్ ప్రైజస్ ఉద్యోగులు సైతం మేము సైతం అన్నారు. తాము కూడా కరోనా నివారణ కోసం ఎంతో కొంత సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు. కంపెనీ తరపున ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా అందిస్తున్న ఈ సాయాన్ని కూడా కరోనా కోసం వినయోగించాలని భారతి సంస్థ కోరింది. ప్రస్తుతం భారత్‌లో లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ ఎయిర్ టెల్ తన సేవల్ని సజావుగా అందిస్తుందిని తెలిపింది. ప్రస్తుతం సంక్షోబ పరిస్థితుల్లో కూడా ఎయిర్ టెల్ నెట్ వర్క్ బృందాలు ఇంటి నుంచి పనిచేస్తున్నాయన్నాయి. ప్రజల్ని తమ ప్రియమైనవారితో కనెక్ట్ చేస్తున్నాయని పేర్కొంది.





Untitled Document
Advertisements