గుడ్ న్యూస్: మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ వాలిడిటీ పొడిగింపు!

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 12:16 PM

గుడ్ న్యూస్: మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ వాలిడిటీ పొడిగింపు!

టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా మొబైల్ ఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ప్రిపెయిడ్ యూజర్లకు రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ పీరియడ్ పొడిగించాలని రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి టెలికం సంస్థలను కోరింది. యూజర్లకు లాక్ డౌన్ 21 రోజుల్లో సేవలకు అంతరాయం కలగకుండా చేసుకోవాలని తెలిపింది. ట్రాయ్ అంతేకాకుండా కస్టమర్లకు నిరంతరాయ సేవలు అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కూడా టెల్కోలను తెలిపింది. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్లకు సేవలకు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు వాలిడిటీని పెంచాలని పేర్కొంది. ప్రిపెయిడ్ సర్వీసుకు సంబంధించి రీచార్జ్ వోచర్లు, పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉండేలా చేసుకోవాలని తెలిపింది. టెలికం సేవలను కూడా అత్యవసర సేవల విభాగం కిందనే చూస్తాం. అందువల్ల వీటిని లాక్ డౌన్‌లో కూడా అనుమతి ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల ఈ సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కస్టమర్ సర్వీస్ సెంటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ ప్రాంతాలపై ఎఫెక్ట్ పడింది. ఇలాటి సందర్భాల్లో ప్రిపెయిడ్ యూజర్లపై ప్రభావం పడుతోంది. అందుకే వాలిడిటీని పెంచాలని ట్రాయ్ ఆదేశించింది. కాగా దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇప్పటికే 7 లక్షల మందికి పైగా ఈ కోవిడ్ 19 సోకింది. ఇప్పటికే 31 వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా మరణించారు. మన దేశంలో కూడా కోవిడ్ సోకిన వారి సంఖ్య 1100 దాటేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements