సామాన్యుడికి శుభవార్త... ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 04:16 PM

సామాన్యుడికి శుభవార్త... ఉపాధి హామీ కూలీల వేతనాలు పెంపు

కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుడికి ఉపాధి కరువైంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసేవారికి దినసరి కూలీ సగటున రూ.20 పెంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాకపోతే పనులకు వెళ్లే వారు దూరం పాటించాలని సూచించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బకాయిలను తీర్చడం కోసం గ్రామీణ మంత్రిత్వ శాఖ ఇటీవలే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.4,431 కోట్లను మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.721 కోట్లను అందజేసింది.

ఉపాధి హామీ కూలీలకు సగటున దినసరి కూలీ 182 రూపాయలు ఉండగా ఇది రూ.202కు చేరుతుంది. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు ఇచ్చే వేతనాన్ని ఈ స్థాయిలో పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2015-16లో ఏడు శాతం పెంచారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధిం కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది.





Untitled Document
Advertisements