లాక్ డౌన్ లో యోగ ఆసనాలు చేయండి అంటున్న ప్రధాని ,,,

     Written by : smtv Desk | Tue, Mar 31, 2020, 05:33 PM

దేశంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఇంటి వద్దే ఉంటూ ఫిట్ గా ఎలా ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తాను తరచుగా పాటించే ఓ యోగాసనం తాలూకు వీడియోను కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు. "నాకెప్పుడు సమయం దొరికినా వారానికి రెండు మూడు సార్లు ఈ యోగాసనాన్ని ప్రాక్టీసు చేస్తుంటాను. దీన్ని యోగనిద్ర ఆసనం అంటారు. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు, మనసును స్థిమితంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఉద్విగ్నతలను తగ్గిస్తుంది" అని మోదీ వివరించారు.



అయితే, ఓ విషయం గమనించాలని, తానేమీ యోగా నిపుణుడ్ని కాదని, యోగా టీచర్ ను కూడా కాదని, కేవలం యోగా అభ్యాసకుడ్ని మాత్రమేనని వివరించారు. తాను పాటించే ఆసనం గురించి ప్రజలతో పంచుకుంటున్నానని స్పష్టం చేశారు. అనేక యోగాసనాలు తనకెంతో ఉపయోగపడ్డాయని, ఈ లాక్ డౌన్ కాలంలో ఇలాంటి యోగా చిట్కాలు ప్రజలకు కూడా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో చెబుతున్నానని వెల్లడించారు.





Untitled Document
Advertisements