కడపలో ఖైదీల విడుదల...మళ్ళీ రావాల్సిందే!!!

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 03:48 PM

కడపలో ఖైదీల విడుదల...మళ్ళీ రావాల్సిందే!!!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్ 19) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న 30 మంది ఖైదీలను బెయిల్‌పై అధికారులు విడుదల చేశారు. వీరిలో 16 మంది శిక్ష పడిన ఖైదీలు ఉండగా.. 14 మంది రిమాండ్‌ ఖైదీలు ఉన్నారు.

కరోనా ప్రభావం కారణంగా జైళ్లలో రద్దీ తగ్గించే క్రమంలో అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. అయితే బెయిల్‌పై విడుదలైన ఖైదీలందరూ ఈ నెల 27న తిరిగి జైలుకు రావాలని జైలు అధికారులు ఆదేశించారు.

కాగా, కరోనా ప్రభావం పెరుగుతున్న వేళ.. జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించాలని, తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు జైళ్ల శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సూచనలను పరిగణలోకి తీసుకున్న అధికారులు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవలే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో సైతం ఏడేళ్ల లోపు శిక్షపడిన ఖైదీలు, ఎక్కువ కాలం రిమాండ్‌లో ఉన్న ఖైదీలను విడుదల చేసినట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements