కరోనా లక్షణాలు లేకున్నా ఏపీలో 14 మందికి పాజిటివ్!!!

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 06:07 PM

కరోనా లక్షణాలు లేకున్నా ఏపీలో 14 మందికి పాజిటివ్!!!

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులకు సంబంధించి మంత్రి పేర్ని నాని షాకింగ్ విషయాలు చెప్పారు. 14 మందిలో కరోనా లక్షణాలు లేకపోయినా 14 మందిలో అయినా కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. వారికి జలుబు, దగ్గు, గొంతుపూత, జ్వరం వంటి లక్షణాలు ఏవీ లేకుండా, ఆరోగ్యంగా ఉన్నా కరోనా పాజిటివ్ అని తేలిందని వ్యాఖ్యానించారు. దీని ద్వారా వ్యాధి లక్షణాలు లేకపోయినా కరోనా వైరస్ సోకవచ్చని ఈ రోజు కొత్తగా తెలిసిందని వెల్లడించారు.

కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్ని నాని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం భయపడే వాతావరణ వచ్చిందని, బుధవారం ఒక్కరోజే కరోనా కేసుల సంఖ్య 87కు చేరిందని గుర్తు చేశారు. ఏపీకి ప్రమాదఘంటికలు మోగుతున్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు బయటకు రాకుండా, ఇంటికే పరిమితం కావాలని హితవు పలికారు.

ఇప్పటికే విజయవాడ సహా పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి 24 గంటల కర్ఫ్యూ విధించినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రెడ్ జోన్ అంటే ఇంట్లో నుంచి ఒక్క నిమిషం కూడా బయటకు రాకూడదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా 6 నుంచి 11 గంటల వరకు బయటకు వెళ్లే వెసులుబాటు ఉందని, అలాగని చెప్పి విచ్చలవిడిగా తిరగొద్దని హితవు పలికారు.





Untitled Document
Advertisements