ఏపీలో ఒక్కరోజే మొత్తం 67 కేసులు

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 10:14 AM

ఏపీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. అయితే తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం సాయంత్రం ఏడు గంటల తరువాత నిర్వహించిన పరీక్షలలో 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే ఈ ఒక్కరోజే మొత్తం 67 కేసులు నమోదవ్వడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా సెంచరీ దాటింది. తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది.





Untitled Document
Advertisements