ఏప్రిల్ 14 వరకు ఫ్రీగా కూరగాయలు....

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 11:17 AM

ఏప్రిల్ 14 వరకు ఫ్రీగా కూరగాయలు....

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిరంతరాయంగా ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, మిల్క్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కర్నాటక సీఎం యడియూరప్ప అన్నారు. ట్రాన్స్ పోర్టు లేక రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సాధ్యం కావట్లేదని, హాప్ కామ్స్ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పేదలకు ఈ నెల 14 వరకు ఫ్రీగా పాలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని జిల్లాల కలెకర్ట్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బుధవారం బెంగళూరులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. అగ్రికల్చర్ ఉత్పత్తులతోపాటు గుడ్లను కూడా హాప్ కామ్స్ ద్వారా అమ్ముతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్, దాల్ మిల్లులను తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.





Untitled Document
Advertisements