కరోనా పరిస్థితులపై అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ . ఈ సందర్భంగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫెరెన్స్లో లాక్ డౌన్ తర్వాత ఎదురయ్యే పరిస్థితులపై చర్చించారు. రోడ్ మ్యాప్ తయారు చేయాలని సీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒకేసారి జనం రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని ఈ సమావేశంలో చర్చించారు. కరోనా మరణాలు తగ్గించడమే ఉమ్మడి లక్ష్యమన్నారు మోదీ. కరోనా కోసం మనమంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు ఒక్కటయ్యి కరోనాపై పోరాడాలన్నారు. అన్ని మతాలకు చెందిన గురువులు మీటింగ్స్ పెట్టి... ప్రజలందరీ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునివ్వాలన్నారు. ప్రతీ రాష్ట్రం, జిల్లా, పట్టణం, గ్రామం, పల్లె స్థాయిలో మత గురువులంతా ఏకమై.. కరోనాపై ఉమ్మడి పోరాటం చేయాలన్నారు. కరోనా కోసం శ్రమిస్తున్న సిబ్బందికి మందులు, వైద్య పరికరాలు అందివ్వడం ముఖ్యమన్నారు. ఎన్సీసీ, ఎన్సీసీ సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని. గుర్తింపు పొందిన ల్యాబుల్లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలన్నారు. ప్రతి జిల్లాలోనూ క్రైసిస్ మేనేజ్ మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ సర్వెలెన్స్ అధికారిని నియమించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మోదీ వీడియో కాన్ఫెరెన్స్కు సంబంధంచిన మరిన్ని వివరాల్ని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్కజ్కు వెళ్లిన వారందర్నీ గుర్తించామన్నారు. ప్రార్థనల్లో పాల్గొన్న 400మందికి కరోనా సోకిందని తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 1965 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. 50 మంది కరోనా వల్ల చనిపోయారన్నారు.
#WATCH Prime Minister Narendra Modi#39;s message at video conference with Chief Ministers on #COVID19 situation in the country. (Source: PMO) pic.twitter.com/H7ZU80tM1w
mdash; ANI (@ANI) April 2, 2020