పొలాన్ని చదును చేస్తున్న తరుణంలో ...వెండి నాణేలు లభ్యం

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 07:40 PM

ఒక వ్యక్తి తన రోజూ వారి పనుల్లో భాగంగా తన పొలాన్ని చదును చేస్తున్న తరుణంలో అనుకోకుండా తనకు తన పొలంలో వెండి నాణేలు లభ్యమయ్యాయి… ఈ అరుదైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే… వికారాబాద్ కి చెందిన మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పొలాన్ని దున్నుతుండగా అకస్మాత్తుగా వెండి నాణేలు బయటపడ్డాయి. అయితే ఈ విషయాన్నీ గుట్టుగా దాచాలనుకున్న ఆ సదరు రైతు, అవి చుసిన కొందరితో దొరికిన ఆ వెండి నాణెల్లోంచి కొన్ని నాణేలను పంచుకొని, అక్కడినుండి వెళ్లిపోయారు.

అయితే ఈ విషయం కాస్త అందరినోట బయటపడి, చివరికి రెవెన్యూ అధికారులు, పోలీసులకు చేరింది. చివరికి సమాచారం అందుకున్న ఆ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి ఆ వెండి నాణేలు బయటపడ్డ పొలానికి వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత వెండి నాణేలు దొరికిన సంగతిని నిర్దారించుకొని వెంకట్రామిరెడ్డి ఇతరుల నుంచి 141 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు





Untitled Document
Advertisements