ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కృష్ణ జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అయితే మిగతా కేసులు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి నమోదు అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 143 కి చేరింది. అయితే ఇప్పటివరకు 1321 నెగటివ్ లుగా తేలాయి. అయితే ఇంకా 409 కరోనా వైరస్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి రిపోర్టులు రేపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.