ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శనివారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. ఈ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 మందికి కరోనా సోకినట్లు తెలిపారు అధికారులు. కృష్ణాజిల్లా నుంచి 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు తెలిపారు. దీంతో ఇవాళ్టి కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 190 చేరిందన్నారు.