కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఇక తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు 25 నమోదు కాగా.. బాధితులకు చికిత్స అందజేసిన వైద్యులకు కూడా కోవిడ్-19 అనుమానిత లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో నలుగురు నమూనాలను సేకరించిన పరీక్షలు పంపారు. ప్రస్తుతం వైద్యులను గాంధీలోని ఐసోలేషన్కు తరలించారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు.