క‌రోనా కట్టడికి మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించిన నేమార్‌ ...

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:44 PM

క‌రోనా కట్టడికి మిలియన్ డాలర్లు విరాళం ప్రకటించిన నేమార్‌ ...

ప్రమాదకరమైన క‌రోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వానికి సహాయం అందించేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు నేమార్‌ భారీ విరాళం ప్రకటించాడు. క‌రోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన త‌న సొంత‌దేశం బ్రెజిల్‌ను ఆదుకునేందుకు ఒక మిలియన్ డాలర్లు (రూపాయలు 7 కోట్ల అరవై ఐదు లక్షలు)ను విరాళంగా ప్రకటించాడు. ఇందులో కొంత మొత్తాన్ని యునిసెఫ్‌కు అందించగా.. మిగతాది క‌రోనా బాధితుల సహాయ కార్యక్రమాలకు అందించనున్నట్లు పేర్కొన్నాడు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క‌రోనా విస్తరించడంతో 11 లక్షల మందికి పైగా పాజిటివ్‌గా తేలారు. ఇప్పటివరకు 40 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు.. వైర‌స్‌పై పోరాటానికి చాలామంది సెల‌బ్రిటీలు పెద్ద మ‌నుతో విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేమార్‌ చేరినట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు నెమార్ క‌రోనా వైర‌స్‌పై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి, విమ‌ర్శ‌ల‌ పాలయ్యాడు. ఒక బీచ్ వాలీబాల్ కోర్టులో చాలామంది సన్నిహితంగా కలసి గడుపుతున్న ఫోటో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. క‌రోనా వైర‌స్ వచ్చిన వేళ అందరూ సెల్ఫ్ ఐసొలేషన్‌కు సిద్ధమవుతున్నవేళ.. నేమార్‌ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే నేమార్ క్వారంటైన్‌లో ఉన్నాడని, ఎవరిని కలవడానికి అనుమ‌తించడం లేదని అతని పీఆర్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.





Untitled Document
Advertisements