SBI న్యూ సర్వీసెస్: ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే డబ్బులు!

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 08:46 PM

SBI న్యూ సర్వీసెస్: ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దకే డబ్బులు!

కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో చాలా మంది బ్యాంకులకు వెళ్లడం కష్టంగా ఉండొచ్చు. అయితే ఎమర్జెన్సీ సమయంలో డబ్బులు అవసరం అనుకుంటే బ్యాంకులు ఇంటి వద్దనే వచ్చి పలు రకాల సర్వీసులు అందిస్తున్నాయి. ఇందుకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా మినహాయింపేమీ కాదు. స్టేట్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది.

స్టేట్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్‌లో భాగంగా క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, ఫామ్ 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, లైఫ్ సర్టిఫికెట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్స్ పికప్ వంటి చాలా సర్వీసులు పొందొచ్చు. ఈ సర్వీసుల కోసం కేవలం ఒక్క ఫోన్ కాల్ కొడితే సరిపోతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో 1800111103 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఈ సదుపాయం పొందొచ్చు.


కాగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం ఈ సర్వీసులు కేవలం సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే హోమ్ బ్రాంచ్‌లో మాత్రమే ఈ సేవలు లభిస్తాయి. ఇంకా కేవైసీ పూర్తయిన అకౌంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.


ఎస్‌బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల కోసం చార్జీలు వసూలు చేస్తోంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.60 చెల్లించుకోవాలి. అదే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు అయితే రూ.100 చార్జీ పడుతుంది. ఈ చార్జీలకు జీఎస్‌టీ అదనం. రోజుకు ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.20,000 వరకు డబ్బులు ఇంటి వద్దకే పొందొచ్చు. డిపాజిట్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. జాయింట్ అకౌంట్లు, మైనర్ అకౌంట్లను ఈ సర్వీసులు అందుబాటులో లేవు.





Untitled Document
Advertisements