మందు షాప్ లో దొంగలు

     Written by : smtv Desk | Sat, Apr 04, 2020, 09:59 PM

కరోనా కారణంగా దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ నేపధ్యంలో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడడంతో మందుబాబులకు ఇది పెద్ద శాపంగా మారింది. మందు లేకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు చేతులు, గొంతులు కోసుకుంటున్నారు.

ఇకపోతే కొందరు మాత్రం ఏకంగా మద్యం కోసం దొంగలుగా మారిపోతున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ వైన్ షాపులో చొరబడి లక్షల విలువైన మద్యం బాటిల్స్‌ని లూటీ చేశారు. షాపు వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్ళిన వారు విలువైన సరుకును తీసుకుని పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements