గుంటూరులో జనసేన అభ్యర్థిపై వాలంటీర్లు దాడి

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 12:38 PM

గుంటూరులో జనసేన అభ్యర్థిపై వాలంటీర్లు దాడి

ఓవైపు కరోనా కేసులతో పాటు.. మరోవైపు రాజకీయ కొట్లాటలు ఏపీలో రాజుకుంటున్నాయి. తాజాగా జనసేన అభ్యర్థిపై వాలంటీర్లు దాడికి దిగిన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వసంతరాయపురంలో జనసేన అభ్యర్థిపై వాలంటీర్లు దాడి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి, రేషన్‌ సక్రమంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించినందుకు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన వాలంటీర్లు జనసేన నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడి కంటికి గాయం అయ్యింది. దీంతో వాలంటీర్లపై స్థానికంగా ఉన్న అరండల్‌ పీఎస్‌లో అతను ఫిర్యాదు చేశాడు.

సమాచారం అందుకున్న జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ వారికి తప్ప పేదలకు పథకాలు అందడం లేదని ఆరోపించారు. తమ పార్టీ నేతపై దాడికి పాల్పడిన వాలంటీర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ పోలీసులను కోరారు. మరోవైపు వాలంటీర్లపై పలుచోట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్ని వాలంటీర్లు కొందరికి మాత్రమే అందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements